ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంజా తరలిస్తూ ఒడిశా వ్యక్తి అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 07, 2025, 10:21 AM

ఒడిశా రాష్ట్ర గంజాం జిల్లా లాఠీ గ్రామానికి చెందిన సురేష్‌ నాయక్‌ 10.25 కిలోల గంజాయితో శ్రీకాకుళం పోలీసులకు గురువారం పట్టుబడ్డాడు. డీఎస్పీ వెంకటప్పారావు తెలిపిన వివరాల మేరకు.. సరేష్‌ తన ఆర్థిక పరిస్థితిని స్నేహితుడైన గంజాయి వ్యాపారి రాజేంద్ర బాడిత్యతో చెప్పాడు. దీంతో గంజాయిని బెంగుళూరు తీసుకుని వెళ్లి తాను చెప్పిన వ్యక్తికి అప్పగిస్తే కిలోకి రూ.1000 ఇస్తానని చెప్పాడు. ఇందుకు అంగీకరించిన సురేష్‌ గతేడాది ఆగస్టులో రాజేంద్ర భాడిత్య చెప్పినఉ్టగా గంజాయి తీసుకుని వెళ్లి బెంగుళూరులో ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి రాజేంద్ర చెప్పిన చోటికి గంజాయిని చేరవేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో గురువారం ఒడిశా రాష్ట్రం బరంపురంలో కొనుగోలు చేసిన 10.25 కిలోల గంజాయిని తీసుకొని బస్సులో కొజ్జిరియా టోల్‌గేట్‌ ముందు గల ఓవర్‌ బ్రిడ్జి వద్ద బస్సు దిగాడు. అక్కడ నుంచి కంచిలి రైల్వేస్టేషన్‌కు వెళ్లేందుకు కొజ్జిరియా జంక్షన్‌ వద్ద బస్సు ఎక్కు తుండగా పోలీసులు పట్టుకుని విచారించి పై వివరాలు రాబట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్యక్ర మంలో సీఐ ఎం.చిన్నమనాయుడు, ఎస్‌ఐ రవివర్మ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa