ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర అప్పులపై అబద్దలాడిన కూటమి నేతలు క్షమాపణ చెప్పాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 10:16 AM

రాష్ట్ర అప్పులపై కూటమి పార్టీల నేతలు చేస్తున్న ప్రచారమంతా పచ్చి అబద్దమని శాసనసభ సాక్షిగా తేలిపోయిందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన, గత ఏడాది వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పులు రూ.5,63,376 మాత్రమేనని ఆర్థికమంత్రి శాసనసభలో లిఖిత సమాధానం ద్వారా అంగీకరించారని తెలిపారు. అందుకే ఇప్పటి వరకు వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై విపరీతంగా దుష్ప్రచారం చేసిన కూటమి నేతలు తమ అబద్దాలపై క్షమాపణ  చెప్పాలని డిమాండ్‌ చేశారు.అయన మాట్లాడుతూ.... వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి, మరో శ్రీలంక అయిందంటూ కూటమి నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌తో పాటు, పురంధేశ్వరీ కూడా దుష్ప్రచారం చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించారు. అసత్యాలతో అధికారంలోకి వచ్చిన తరువాత తాజాగా గవర్నర్‌ తోనూ అప్పులపై సమగ్ర సమాచారం లేకుండానే బడ్జెట్‌ ప్రసంగం చేయించారు. ఓట్ల కోసం కూటమి పార్టీలు వైయస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు మోపారు. గత ప్రభుత్వం ఏకంగా రూ. 14 లక్షల కోట్ల అప్పులు చేసిందంటూ విష ప్రచారం చేశారు. మరి ఇప్పుడు దానికి ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa