ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇళ్ల పేరుతో ప్రజలని మోసం చేసారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 11:49 AM

ఇందిరమ్మ ఇళ్లు కట్టకుండానే కట్టినట్లుగా వైసీపీ నేతలు బిల్లులు డ్రా చేశారని, రాష్ట్రవ్యాప్తంగా 12లక్షల మంది ఈ తరహాలో మోసపోయారని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. వారందరి పేర్లు ఇళ్లు నిర్మించుకున్నవారి జాబితాలో ఉండటంతో ఇప్పుడు కొత్త ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటే అనర్హుల జాబితాలో చూపుతోందని, వారికి ఇళ్లు కట్టుకునేందుకు తిరిగి అవకాశం కల్పించాలని కోరారు. అప్పట్లో ఇళ్లు నిర్మించుకున్నట్లుగా ఉన్న వారి జాబితా నుంచి ఆ 12లక్షల మంది పేర్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa