ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోహ్లీ కి గాయం ఫైనల్ ఆడతాడా...?

sports |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 11:23 PM

2025 ఛాంపియన్స్ ట్రోఫీ రేపు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే నల్‌కు ముందు టీమిండియాకు షాకింగ్ న్యూస్ వచ్చింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడని, అందుకే ప్రాక్టీస్ సెషన్ కు దూరమయ్యాడని సమాచారం. ప్రాక్టీస్ సెషన్ లో పేసర్ బంతిని ఎదుర్కొన్న సందర్భంగా విరాట్ కోహ్లీకి గాయమైందని జియో న్యూస్ రిపోర్ట్ చేసింది. నెట్స్ లో పేస్ బౌలర్ బంతిని ఆడేందుకు యత్నించగా, కోహ్లీ మోకాలి సమీపంలో దెబ్బ తగిలిందని దాంతో ప్రాక్టీస్ మధ్యలోనే వెళ్లిపోయాడని రిపోర్ట్స్ వచ్చాయి. బంతి తగలడంతో కోహ్లీకి గాయం కావడంతో, వెంటనే ఫిజియో ప్రాథమిక చికిత్స చేశాడు. గాయం తగిలిన చోట పెయిన్ కిల్లర్ స్ప్రే చేసి, బ్యాండేజ్ చుట్టినట్లు రిపోర్ట్ చేసింది. ఆ వెంటనే కోహ్లీ ప్రాక్టీస్ సెషన్ నుంచి తప్పుకుని, సహచర ఆటగాళ్ల ప్రాక్టీస్ ను గమనించారని వైరల్ అవుతోంది. కీలక మ్యాచ్ కు ముందు కోహ్లీ గాయపడ్డారని తెలియగానే క్రికెట్ ప్రేమికులు టెన్షన్ పడుతున్నారు. అయితే గాయం తీవ్రత తక్కువేనని ఫైనల్ మ్యాచ్ కు కోహ్లీ సిద్ధంగా ఉంటాడ ని ఫిజియో, సహాయక సిబ్బంది చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa