వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీన తలపెట్టిన ‘యువత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్యార్థులు, యువత తరలిరావాలని వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ పిలుపునిచ్చారు. యువత పోరు కార్యక్రమం విజయవంతం చేసేందుకు అనంతపురం పార్టీ కార్యాలయంలో ఆయన స్థానిక యువతతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా సలామ్ మాట్లాడారు.`రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన (కూటమి) నేతలు ఎన్నికల ముందు ఇంటింటికీ వచ్చి తల్లికి వందనం ప్రతి ఒక్కరికీ రూ.15,000 ఇస్తాం అని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. లేకుంటే భృతి ఇస్తామని , ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తామని అనేక హామీలను గుప్పించి 9 నెలల పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మోసం చేశారు. ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసంపై గళం విప్పుదాం. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ సరైన కేటాయింపులు చేయలేదు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa