ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు ఎంత విరాళాలు వచ్చాయంటే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 10:28 PM

తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల నుంచి భారీగా విరాళాలు అందుతాయనే విషయం తెలిసిందే. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుణ్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. అలాగే టీటీడీ చేపట్టే కార్యక్రమాలకు తమ మద్దతుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు అందిస్తూ ఉంటారు. టీటీడీ ఆధ్వర్యంలో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు, ప్రాణదానం ట్రస్టు ఇలా అనేక ట్రస్టులు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే వ్యాపారువేత్తలు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు టీటీడీక్ విరాళాలు అందిస్తూ ఉంటారు. అయితే టీటీడీకి అందే విరాళాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంటుంది.


ఈ నేపథ్యంలో టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు విరాళాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు విరాళాలు వివరాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. టీటీడీ శ్రీవెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు విరాళాలు రూ 2,200 కోట్లు దాటినట్లు టీటీడీ ఛైర్మన్ ప్రకటించారు. 1985లో తిరుమలలో అన్నదానం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించారని బీఆర్ నాయుడు తెలిపారు. 2014లో శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌గా పేరు మార్చినట్లు వివరించారు. తొలుత 2 వేలమందితో ప్రారంభమై, ప్రస్తుతం రోజుకు లక్ష మంది భక్తులకు అన్నవితరణ చేసే స్థాయికి ట్రస్టు అభివృద్ధి చెందిందని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు.


ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ అత్యధికంగా 9.7 లక్షల మంది దాతలు ఉన్నారన్న టీటీడీ ఛైర్మన్.. 139 మంది భక్తులు కోటి రూపాయలు, లేదా అంతకుమించి విరాళమిచ్చినట్లు వివరించారు.ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు ఖర్చు అవుతుందని.. 249 మంది భక్తులు ఒక్కరోజు అన్నదానానికి విరాళం ఇచ్చినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో అన్నప్రసాదంపై ప్రత్యేక దృష్టి సారించిందన్న టీటీడీ ఛైర్మన్.. ప్రస్తుతం భక్తులకు మరింత రుచిగా, శుచిగా అన్నప్రసాదం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీవారి భక్తుల భోజనం మెనూలో శెనగ వడలను వడ్డిస్తున్నామని.. దీనిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa