చిత్తూరు నగరంలోని గాంధీరోడ్డులో షాపింగ్ సెంటర్లో బీభత్సం సృష్టించిన అంతర్ రాష్ట్ర ముఠా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి తుపాకులు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం షాపింగ్ సెంటర్ లోకి ఆరుగురు దొంగలు తుపాకులతో ప్రవేశించి భారీ చోరీకి యత్నించారు. షాప్ యజమానిని బెదిరించి చోరీకి యత్నించారు. అయితే దొంగల దాడి నుంచి గోడ దూకి షాపు యజమాని తప్పించుకున్నారు. గోడ దూకే క్రమంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. అయితే షాపు లోపలకు చొరబడ్డ దొంగలను షట్టర్ వేసి బయటకు రానీకుండా యజమాని బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. సినిమా తరహాలో స్థానికుల సహాయంతో పోలీసులు రిస్క్యూ ఆపరేషన్ చేశారు. ఐదుగురు దొంగలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు తుపాకులు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలు చిత్తూరు, తమిళనాడు, కర్ణాటకకు చెందినవారిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa