ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోటరీ వలన జగన్ నష్టపోయే అవకాశం ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 12, 2025, 04:49 PM

కాకినాడ పోర్టు వాటాలను బలవంతంగా బదిలీ చేయించుకున్నారన్న కేసులో నిందితుడిగా ఉన్న మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సీఐడీ విచారణ ముగిసింది. విచారణ అనంతరం ఆయన మీడియాలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఎదగడానికి తనను కొందరు కిందకు లాగారని ఆయన అన్నారు. వైసీపీ అధినేత జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగా ఆయనకు తీవ్ర నష్టం జరుగుతోందని చెప్పారు. కోటరీ నుంచి బయటకు రాకపోతే జగన్ కు రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు. తన మనసులో జగన్ కు సుస్థిరమైన స్థానం ఉందని విజయసాయి చెప్పారు. జగన్ మనసులో మాత్రం తనకు స్థానం లేదని... అందుకే తాను పార్టీ నుంచి బయటకు వచ్చేశానని తెలిపారు. కోటరీ వల్లే తాను జగన్ కు దూరమయ్యానని చెప్పారు. కోటరీ మాటలు వినొద్దని జగన్ కు స్పష్టంగా చెప్పానని తెలిపారు. భవిష్యత్తుల్లో మళ్లీ వైసీపీలో చేరే అవకాశమే లేదని స్పష్టం చేశారు. విరిగిపోయిన మనసు మళ్లీ అతుక్కోదని అన్నారు. ఏ పార్టీలో చేరాలనేదానిపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa