ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయసాయిరెడ్డి కుమార్తె అక్రమ కట్టడాలని తొలిగించిన అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 16, 2025, 11:56 AM

వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. హైకోర్టు అదేశాలతో పది అడుగుల మేర భూమి లోపల వరకు తవ్వి కాంక్రీట్ గోడలను ధ్వంసం చేశారు. విశాఖ జిల్లా భీమిలి బీచ్‌లో విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి అక్రమ కాంక్రీట్ నిర్మాణాలను కూల్చివేయాలని గతంలోనే ఏపీ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో టౌన్ ప్లానింగ్ అధికారులు పైపైన నిర్మాణాలు తొలగించి చేతులు దులుపుకున్నారు. అక్రమ నిర్మాణాలను పాక్షికంగా తొలగించడంపై పిటిషనర్, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించడంతో, అక్రమ నిర్మాణాలు పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. దీంతో అధికారులు నిన్న పూర్తిగా అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు చేపట్టారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa