ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర గిరిజనుల కష్టాన్ని గుర్తించాం కాబట్టే పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్ పెట్టించాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 24, 2025, 02:15 PM

పార్లమెంట్‌లో అరకు వ్యాలీ కాఫీ స్టాల్స్‌ సోమవారం ఏర్పాటు అయ్యాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. తూర్పు కనుమల నుండి భారత దేశ పార్లమెంట్ వరకు అరకు వ్యాలీ కాఫీ ప్రస్థానం దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఏపీ రాష్ట్ర గిరిజనుల కష్టాన్ని ప్రపంచం గుర్తించబోతుందని, వారి స్వహస్తాలతో పండించిన కాఫీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి నిలయమైన భారత పార్లమెంట్‌లో ఎంపీలు అందరినీ అమోఘమైన రుచితో మైమరపించబోతుందన్నారు. ఈ స్టాల్స్‌ను కేంద్ర మంత్రులు.. ప్రారంభం చేయడం సంతోషంగా సంతోషంగా ఉందని కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సంధ్యా రాణి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు,కమ్యునికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని, ఏపీ కూటమి ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa