ప్రధాని మోదీ నాయకత్వంలో 1.45 బిలియన్ల భారతీయుల ఆకాంక్షలకు బలమైన దిశానిర్దేశం చేయడం, ప్రపంచ వృద్ధికి భారతదేశం ప్రధానంగా మారడం ద్వారా తాను ఎంతో ప్రేరణ పొందానని మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ జూపల్లి రాము రావు అన్నారు. భారతదేశ పురోగతిని ప్రపంచ బ్యాంకు, IMF కూడా అంగీకరిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రపంచం దృష్టంతా నేడు భారత్పై ఉందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలోని ప్రతీ దేశ పౌరుడు ఒక జిజ్ఞాసతో భారత్ వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ తన కీలక ఉపన్యాసంలో సమకాలీన రాజకీయాలతో పాటు అనేక జాతీయ అంతర్జాతీయ అంశాలను ప్రస్తావించారు.భారత దేశం నేడు ఏం ఆలోచన చేస్తోందని యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోందని ప్రధాని మోదీ అన్నారు. వల్డ్ ఆర్డర్లో భారతదేశం కేవలం పాల్గొనడం మాత్రమే కాదు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, పదిలపరచడంలోనూ తోడ్పాటు అందిస్తోందని తెలిపారు. గతాన్ని, వర్తమానాన్ని పోల్చుతూ అనేక అంశాలను ప్రధాని ఉదహరించారు.టీవీ నైన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని మోదీకి మైహోం గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికగా ఇద్దరూ ఆసీనులయ్యారు.వాట్ ఇండియా థింక్స్ టుడే ఒక వినూత్నమైన, అద్భుతమైన కార్యక్రమం, ఇతర చానెళ్లు కూడా అనుకరించక తప్పదని అన్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీవీనైన్ నెట్వర్క్కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa