ఐపీఎల్ 2025లో వరుసగా రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్.. మరో మ్యాచ్కు సిద్ధమైంది. గుజరాత్ టైటాన్స్తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్.. ఆర్సీబీకి బ్యాటింగ్ అప్పగించాడు. ఈ మ్యాచ్ కోసం గుజరాత్ టైటాన్స్ జట్టులో ఒక మార్పు జరిగింగి. కగిసో రబాడా ప్లేసులో అర్షద్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. అటు ఆర్సీబీ సేమ్ టీమ్తో మ్యాచ్ ఆడుతోంది.
ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐదు మ్యాచ్లు జరిగాయి. అందులో ఆర్సీబీదే పైచేయిగా ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడింట్లో గెలవగా, గుజరాత్ రెండు మ్యాచ్లలో విజయం సాధించింది. ఈ రెండు జట్లు చివరగా ఆడిన మ్యాచ్లో ఆర్సీబీ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇక హోంగ్రౌండ్ చిన్నస్వామిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 91 మ్యాచ్లు ఆడింది. అందులో 43 మ్యాచ్ల్లో గెలిచి.. మరో 43 మ్యాచ్లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై కాగా, మరో నాలుగు మ్యాచ్లలో ఫలితం తేలలేదు. కాగా ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్లలో విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రసానంలో ఉంది. మరి మూడో మ్యాచ్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొడుతుందా? అనేది తేలాల్సి ఉంది. ఇక సొంత గడ్డపై ఆర్సీబీ చెలరేగి ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తుది జట్లు..
ఆర్సీబీ:
ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్దత్ పడిక్కల్, రజత్ పాటీదార్ (కెప్టెన్) లియామ్ లివింగ్స్టోన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, యశ్ దయాళ్
గుజరాత్ టైటాన్స్:
సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ
![]() |
![]() |