నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి (M) యాతలూరులో రైతులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా దళారులకు చోటు లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా దళారులకు చోటు లేదన్నారు. రైతుల దగ్గర నుంచి తీసుకున్న ధాన్యానికి 24 గంటల్లోనే నగదు చెల్లింపులు చేస్తున్నామని, రైతుల నుంచి 36 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. ఖాతాల్లో రూ.8,300 కోట్లు జమ చేశాం. తిరుపతి జిల్లాల్లోనే 74వేల టన్నులు సేకరించాం. ఖరీఫ్లోనూ మరో 56 వేల టన్నులు కొనుగోలు చేస్తాం. ఈ-కేవైసీ నమోదు కాలేదని ధాన్యం కొనుగోళ్లు ఆపేది లేదు’’అని అన్నారు.
![]() |
![]() |