తాజాగా మరో రెండు దేశాల్లో భూంకంపం సంభవించింది. ఇండియాకు పొరుగున ఉన్న నేపాలల్లో స్వల్ప భూకంపం రాగా.. రిక్టర్ స్కేల్పై 5.0 తీవ్రతగా నమోదైంది. భూకంప కేంద్రం గర్ఖాకోట్కు మూడు కి.మీ దూరంలో, 20కి.మీ లోతులో ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం 7.52 గంటల సమయంలో భూ కంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఉత్తర భారతదేశంపై కూడా ఈ ప్రభావం కనిపించింది అంటున్నారు. ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్లలో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయని చెబుతున్నారు. అయితే స్వల్ప భూ ప్రకంపనలు కావడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు.
నేపాల్ మాత్రమే కాదు పపువా న్యూ గినియాలో కూడా భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.9గా నమోదుకాగా.. పశ్చిమ న్యూ బ్రిటన్ ప్రావిన్స్లోని కింబే ప్రాంతానికి 194 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది. 10 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ మేరకు అమెరికా సునామీ హెచ్చరికలు జారీచేసింది. ఈ క్రమంలో ప్రజల్ని కూడా అలర్ట్ చేశారు. ఇటీవలే మయన్మార్, థాయ్లాండ్లలో సంభవించిన భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఈ ఘటనలో ఒక్క మయన్మార్లోనే మూడువేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో గాయపడ్డారు. ఈ రెండు దేశాల్లో రెస్క్యూ టీమ్ సహాయచర్యలు కొనసాగుతున్నాయి. అంతేకాదు జపాన్ను కూడా భూకంపం వణికిస్తోంది.. తాజాగా నేపాల్, పపువా న్యూ గినియాలో భూకంపం రావడం కలకలం రేపింది.
ఇలా వరుసగా భూకంపాలతో జనాలు ఆందోళనలో ఉన్నారు.. ఈసారి మన దేశానికి సమీపంలో ఉన్న నేపాల్లో భూకంపం రావడం కలవరపెడుతోంది.. భారత్లో కూాడా భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి.. నేపాల్ భూకంపం ప్రభావం ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలపై కనిపిచండంతో అక్కడి జనాలు కాస్త ఆందోళనలో ఉన్నారనే చెప్పాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa