జగన్ రాప్తాడు పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.ఈ నేపథ్యంలో హోం మంత్రి అనిత స్పందిస్తూ నిన్నటి జగన్ పర్యటన డ్రామాను తలపించిందని అన్నారు. జగన్ పర్యటన సందర్భంగా 1,100 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కూడా ఇంతటి భద్రతను కల్పించలేదని చెప్పారు.జగన్ వెళుతున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ అని అందుకే భారీ భద్రతను కల్పించామని అన్నారు. వైసీపీ హయాంలో 2,800కి పైగా టీడీపీ నేతలు, కార్యకర్తల హత్యలు జరిగాయని అనిత తెలిపారు. రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమది ఇలాంటి సంస్కృతి కాదని చెప్పారు. హెలిపాడ్ వద్దకు వైసీపీ కార్యకర్తలు తోసుకుంటూ వచ్చారని ఈ క్రమంలో కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయని అనిత చెప్పారు.వైసీపీ వాళ్లు పద్ధతి మార్చుకోకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. ఎస్సై సుధాకర్ కు నిజంగా దమ్ముందని అన్నారు. పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు జగన్ సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa