ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తరచూ చేపలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Apr 10, 2025, 04:06 PM

చేపలు తింటే మెదడు పనితీరు చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. నాన్‌ వెజ్‌ ప్రియులకు చికెన్‌, మటన్‌తో పాటు చేపలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు..  తరుచుగా చేపలు తీసుకోవడం వలన గుండె జబ్బులు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే.. అందులో ఉండే ఒమేగా-3 కొవ్వులు, ఇతర పోషకాలు హార్ట్​కి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయి.. చేపల్లో శరీరానికి అవసరమయ్యే మంచి ప్రొటీన్ ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. చేపల్లో ఉండే విటమిన్ డి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. షుగర్ లెవల్స్‌ను అదుపు చేస్తుంది. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తనాళాలను శుద్ధి చేస్తూ వాటిలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోకుండా చూస్తాయి. కాబట్టి వారానికి రెండు రోజులు చేపలను తినడం చాలా మంచిదని చెబుతున్నారు. అంతేకాదు, చేపలను తినని వారి కంటే వారానికి రెండు సార్లు చేపలు తినే వ్యక్తులలో గుండెపోటు, గుండె జబ్బుల ముప్పు ఎందుకు తక్కువగా ఉంటుందో వివరించడానికి కూడా ఇది సహాయపడవచ్చని సూచిస్తున్నారు.తరచూ చేపలు తినడం వల్ల శారీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ చేపలను తినే వ్యక్తులు ఎలాంటి మానసిక ఆరోగ్య సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉంటున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, చేపలు ఒత్తిడి, ఆందోళన, టెన్షన్‌ను కూడా తగ్గిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa