సిక్కింలోని గ్యాల్షింగ్ జిల్లాకు చెందిన ఓ 13 ఏళ్ల బాలికకు.. అక్కడే ఉండే ఓ మహిలతో పరిచయం ఏర్పడింది. వారి ఇంటికి కొంచెం దూరంలోనే మహిళ ఇళ్లు ఉండగా తరచుగా ఆమె వారింటికి వెళ్లేంది. సదరు మహిళ సైతం రోజూ ఫోన్ చేసి మరీ బాలికను రమ్మనేది. ఈక్రమంలోనే తరచుగా వారి ఇంటికి వెళ్లిన బాలికపై ఆమె భర్త కన్నేశాడు. ఎవరూ లేని సమయం చూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న భార్య గొడవ చేయాల్సిందిపోయి భర్తనే సమర్థించింది. అదేం పెద్ద తప్పు కాదని చెబుతూనే బాలికను మళ్లీ మళ్లీ వారి ఇంటికి పిలిపించుకుంది. ఇలా అనేక మార్లు ఆమె భర్తతో లైంగిక చర్యలకు ఉసిగొల్పింది.
ఇది చాలదన్నట్లుగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఓ అద్భుతమైన ప్లాన్ వేశారు. ముఖ్యంగా తమకు తెలిసిన పురుషుల నుంచి డబ్బులు తీసుకుని అమ్మాయిని వారికి అప్పగించాలనుకున్నారు. ఇలా ముందు ఓ ఇద్దురు పురుషుల నుంచి డబ్బులు తీసుకుని అమ్మాయిని అప్పగించారు. చాలా రోజుల పాటు వారు అమ్మాయిని బలవంతంగా అనుభవించారు. ఆ ఇద్దరి తర్వాత మరో నలుగురు అబ్బాయిల నుంచి కూడా డబ్బులు తీసుకుని బాలిక వద్దంటున్నా వినకుండా వారి గదిలోకి పంపారు. ఇలా ఏడాది కాలంగా జరుగుతూనే వస్తుంది. మొత్తంగా ఏడుగురు తరచుగా అమ్మాయిపై లైంగికి దాడికి పాల్పడుతూనే ఉన్నారు.
అయితే ఇంట్లో వాళ్లకి చెబితే ప్రాణాలు తీస్తామని భయపెట్టగా.. బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. అసలే చిన్న వయసు కావడం, తరచుగా మృగాళ్లు బాలికపై అత్యాచారానికి పాల్పడుతుండడంతో.. ఆమె ఆరోగ్యం క్షీణించింది. బడికి వెళ్లిన ప్రతీసారి అనారోగ్యంగా ఉంటూ.. గదిలో ఓ పక్కన కూర్చుని ఆలోచిస్తూ ఉండేది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన ఓ ఉపాధ్యాయుడు బాలికతో మాట్లాడాడు. ఏమైందంటూ ప్రేమగా బుజ్జగిస్తూ అడిగాడు. దీంతో బాలిక జరిగిందంతా చెప్పింది. ఏడాది కాలంగా చిన్నారి జీవితం నాశనం అవుతున్న విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు వెంటనే చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈక్రమంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. బాలిక నిందితుల పేర్లను వెల్లడించింది. మహిళ, ఆమె భర్త సహా మరో ఆరుగురు నిందితులను పట్టించింది. అయితే ఇందులో నలుగురు అబ్బాయిలు మైనర్లు అని గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే వీరందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు తీవ్ర అనారోగ్యానికి గురైన బాధిత బాలికకు కౌన్సిలింగ్, వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa