ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మరికొందరు ఉద్యోగుల తొలగింపు.. ,,,, ప్రభుత్వం సంచలన నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 07:49 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైబర్ నెట్ విషయంలో మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా మరోసారి ఉద్యోగుల్ని భారీగా తొలగించింది. ఈసారి దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలో సూర్య ఎంటర్‌ప్రైజెస్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు వారిని తొలగించనున్నారు. ఈ నెలాఖరుతో వారి ఉద్యోగాల గడువు ముగియనుంది.. వారి కాంట్రాక్టును పొడిగించబోమని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్‌లో అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరా తీసింది.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అంతేకాదు ఇటీవల 248మందిని తొలగించారు.


గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు చెప్పిన వారందరినీ ఫైబర్ నెట్‌లో ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే వీరిలో ఎక్కువమంది ఉద్యోగుల్ని రాయలసీమ జిల్లాకు సంబంధించిన వారిని తీసుకున్నారనే టాక్ వచ్చింది. వీరిలో చాలామంది ఉద్యోగులు కార్యాలయానికి రాకుండానే జీతాలు తీసుకునేవారనే ఆరోపణలు వచ్చాయి. ఆ వెంటనే దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది.


2014-2019 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తక్కువ ధరకే కేబుల్, నెట్, ఫోన్ సేవలను అందించింది.. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఎంతోమంది కనెక్షన్లు తీసుకున్నారు. కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్‌ విషయంలో విమర్శలువచ్చాయి.. అలాగే ఏపీ ఫైబర్ నెట్ అప్పుల్లో కూరుకుపోయిందని కూటమి ప్రభుత్వంలోని పార్టీలు ఆరోపించాయి. అలాగే ఫైబర్ నెట్ కనెక్షన్లు కూడా తగ్గిపోయాయనే విమర్శలు వచ్చాయి.


టీడీపీకి షాక్.. జీవీ రెడ్డి రాజీనామా.. ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి కూడా..


అయితే గత ప్రభుత్వంలో నియమితులైన ఉద్యోగులు ఉండటంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వా తీసుకున్న నిర్ణయాలు అమలు కాలేదు. దీంతో ప్రభుత్వం అక్రమాలపై విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ఉద్యోగులు ఆఫీసుకు కూడా వెళ్లకుండా జీతాలు తీసుకునేవారని విచారణలో తేలడంతో వారందరినీ తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రెండు, మూడుసార్లు పలువుర్ని తొలగించగా.. తాజాగా మరో 500 మంది ఉద్యోగులను తొలగించారు. ఆ స్థానాల్లో కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టే అవకాశం ఉందంటున్నారు.


అలాగే ఇటీవల ఫైబర్ నెట్ సంస్థకు ఛైర్మన్‌గా ఉన్న జీవీరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, ఉద్యోగుల నియామకాల విషయంలో సంస్థ ఎండీ తిరుపై జీవీరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఎపిసోడ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు చేరింది.. దీంతో జీవీరెడ్డి రాజీనామా, ఆ సంస్థ ఎండీగా ఉన్న దినేష్ కుమార్‌ను బదిలీ చకచకా జరిగిపోయాయి.. ఆ తర్వాత ఆ సంస్థలో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa