ఐక్యరాజ్యసమితికి మొఘల్ చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడు యాకూబ్ హబీబుద్దిన్ లేఖ రాశారు. మహారాష్ట్రలోని ఔరంగజేబు సమాధిని తొలగించాలని ఓ వర్గం వారు హింసాత్మక ఘటనలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శంభాజీ నగర్ జిల్లాలో ఉన్న ఔరంగజేబు సమాధికి భద్రత కల్పించాలని అలాగే అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని లేఖలో పేర్కొన్నారు."ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం, రక్షిత స్మారక చిహ్నం వద్ద లేదా సమీపంలో ఎటువంటి అనధికార నిర్మాణం, మార్పులు, విధ్వంసం లేదా తవ్వకం చేపట్టకూడదు. అలాంటి ఏదైనా కార్యకలాపాలు చట్టవిరుద్ధమైనవి, చట్ట ప్రకారం శిక్షార్హమైనవిగా పరిగణించబడతాయి" అని యూఎన్ సెక్రటరీ జనరల్కు రాసిన లేఖలో పేర్కొన్నారు."సినిమాలు, మీడియా సంస్థలు, సామాజిక వేదికల ద్వారా చారిత్రక వర్గాలను తప్పుగా చూపించడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఫలితంగా అనవసరమైన నిరసనలు, ద్వేషపూరిత ప్రచారాలు, దిష్టిబొమ్మలను దహనం చేయడం వంటి ప్రతీకాత్మక దురాక్రమణ చర్యలు జరిగాయి" అని ఆయన లేఖలో పేర్కొన్నారు.కాగా, ఇటీవల వచ్చిన ఛావా సినిమాలో ఔరంజేబును క్రూరాతి కృరుడిగా చూపించిన విషయం తెలిసిందే. దాంతో మూవీ చూసిన తర్వాత కొన్ని వర్గాలు ఆయన సమాధి వద్ద ఆందోళనకు దిగాయి. వెంటనే సమాధిని అక్కడి నుంచి తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ఆయన తన లేఖలో ప్రస్తావించా
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa