ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా మారిపోయారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీ ఎజెండా మోస్తున్నారని ఆరోపించారు. కాషాయ బట్టలు కట్టుకుని, నుదుటిన బొట్టు పెట్టుకుని పవన్ కళ్యాణ్ బీజేపీ ఎజెండా మోస్తున్నారంటూ సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా చెప్పుకునేందుకు క్రిస్టియన్ అయిన భార్యకు తిరుమలలో గుండు చేయించారని.. అంత అవసరమా అని రామకృష్ణ ప్రశ్నించారు. వక్ఫ్ చట్టంపైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరుపైనా రామకృష్ణ విమర్శలు గుప్పించారు,
మరోవైపు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇటీవల తిరుమలను సందర్శించిన సంగతి తెలిసిందే. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తనయుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడిన నేపథ్యంలో.. అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన పవన్ కళ్యాణ్ సతీమణి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తిరుమలలో నిత్యాన్నదానం కోసం అన్నా లెజినోవా రూ.17 లక్షలు విరాళంగా అందించారు. ఒక పూట అన్న ప్రసాదం వితరణకు అయ్యే 17 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఇక క్రిస్టియన్ అయిన అన్నా లెజినోవా.. టీటీడీ అధికారులకు డిక్లరేషన్ అందించి.. శ్రీవారిని దర్శించుకున్నారు.
అయితే అన్నా లెజినోవా తలనీలాల సమర్పణపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ క్రిస్టియన్ అయిన తన భార్య చేత తలనీలాలు సమర్పింపజేశారంటూ కొంతమంది నెటిజనం విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే సీపీఐ రామకృష్ణ అన్నా లెజినోవా తలనీలాల సమర్పణపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు సింగపూర్లో జరిగిన ప్రమాదంలో మార్క్ శంకర్, కాళ్లూ, చేతులకు గాయాలయ్యాయి.
ఊపిరితిత్తుల్లోకి పొగచూరి అస్వస్థతకు గురయ్యారు. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకున్నారు. మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలియగానే పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఆయన సతీమణి ముగ్గురూ సింగపూర్ వెళ్లారు. మార్క్ శంకర్ పవనోవిచ్ కోలుకున్న తర్వాత తిరిగి ఇండియాకు వచ్చారు. హైదరాబాద్ చేరుకోగానే అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa