ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో రూ.97,700 పలికిన పసిడి

business |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 08:23 PM

బంగారం ధర సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.98 వేలు దాటింది. ఢిల్లీలో ఒక్కరోజులోనే రూ. 1,650 పెరిగి రూ.98,100 ను తాకింది. సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి రూ.97,700 కు చేరుకుంది.వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి రూ. 1,900 పెరిగి రూ.99,400లకు చేరింది. మంగళవారం కిలో వెండి రూ. 97,500 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 3,318 డాలర్లకు చేరుకుంది. గోల్డ్ మన్ శాక్స్ అంచనా ప్రకారం బంగారం ధరలు ఈ ఏడాది చివరి నాటికి రూ. 1.25 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. వాణిజ్య యుద్ధం, ట్రంప్ సుంకాల ప్రభావంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa