ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యం విక్రయాలకి నాకు సంబంధం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 07:00 PM

గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం విక్రయాల్లో తాను ఎప్పుడు జోక్యం చేసుకోలేదని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. నాటి మద్యం విక్రయాల్లో కర్మ, కర్త, క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. అనంతరం విజయసాయిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. రాజ్‌ కసిరెడ్డి మూడు కంపెనీలు ఏర్పాటు చేసి.. కొత్త మద్యం బ్రాండ్‌లను తయారు చేసి విక్రయించిన సంగతి తనకు తెలియదన్నారు. అందులో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పాత్ర గురించి సైతం తనకు తెలియదని సిట్ అధికారులకు స్పష్టం చేశానన్నారు.అయితే తనను అడిగిన ప్రశ్నలన్నింటికి రాజ్‌ కసిరెడ్డి మాత్రమే సమాధానం చెప్పగలరని ఈ సందర్భంగా సిట్ అధికారుల ఎదుట చెప్పినట్లు విజయసాయిరెడ్డి వివరించారు. ఇక మూడు కంపెనీలను రాజ్‌ కసిరెడ్డి లీజుకు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తాను పైవిధంగా సమాధాన మిచ్చానన్నారు. ఇక రాజ్‌ కసిరెడ్డి మోసం చేసింది తనను కాదని పార్టీని.. ప్రజలనని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa