ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఆ ఖైదీలందరూ త్వరలోనే జైలు నుంచి విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 07:59 PM

ఆంధ్రప్రదేశ్‌లోని జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు వారి శిక్షను తగ్గించి, ముందుగానే విడుదల చేసేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది.. ఓ కమిటీని నియమించింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాను సిద్ధం చేయాలని జైళ్ల శాఖ డీజీని ఆదేశించింది. అర్హులైన ఖైదీలను ఏటా ఫిబ్రవరి, జూన్, అక్టోబరు 1వ తేదీల్లో విడుదల చేయనున్నారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి ఖైదీకి సంబంధించిన కేసులు, శిక్ష, ఇతరత్రా నిబంధనలకు అనుగుణంగా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.


ముందుగా అర్హులైన ఖైదీల జాబితాను జైళ్ల శాఖ డీజీ ప్రభుత్వానికి పంపిస్తారు.. ఆ తర్వాత హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఆ జాబితాను పరిశీలిస్తుంది. ఈ కమిటీలో న్యాయశాఖ కార్యదర్శి, డీజీపీ, సీఐడీ ప్రధాన న్యాయ సలహాదారు, నిఘా విభాగాధిపతి, జైళ్ల శాఖ డీజీ సభ్యులుగా ఉంటారు. ప్రతి ఖైదీకి సంబంధించిన కేసు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనర్హులను తొలగిస్తారు. ముందుస్తు విడుదల పొందిన ఖైదీలు రూ.50 వేలకు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలి. అలాగే ఆయా ఖైదీలు వారి శిక్షాకాలం పూర్తయ్యే వరకూ స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్‌ అధికారి వద్ద ప్రతి 3నెలలకు ఒకసారి హాజరవ్వాల్సి ఉంటుంది. విడుదలైన తర్వాత వారు మళ్లీ నేరం చేసినా, అరెస్టైనా వారి క్షమాభిక్ష రద్దు అవుతుంది. విడుదలైన ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలని.. లేదంటే మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. చాలా ఏళ్లుగా ఖైదీల విడుదల ప్రక్రియ ఆగిపోయింది.. దీంతో ఏపీ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.


విజయనగరంలోని ఏపీఎస్పీ బెటాలియన్‌ అదనపు కమాండెంట్‌ ఎం.వెంకటేశ్వరరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన ప్రస్తుతం బెటాలియన్స్‌ ప్రధాన కార్యాలయంలో ఉండగా.. అదనపు కమాండెంట్‌గా నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తాను జైలు జీవితం కూడా అనుభవించాను అంటున్నారు హోంమంత్రి అమిత్ షా.. తానప్పుడు విద్యార్థిగా ఉన్నానని.. ఓ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడంతో తమను అరెస్ట్ చేశారని..ఏడు రోజులు జైల్లో ఉంచారని..తాను జైలు భోజనం చేసినట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa