ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధాని పేరుతో పెద్ద ఎత్తున ప్రజాధనంను లూటీ చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 20, 2025, 12:49 PM

రాజధాని అమరావతి నిర్మాణంలో అంతులేని దోపిడికి సీఎం చంద్రబాబు తెగబడ్డాడని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణ సంస్థల టెండర్లలో పెద్ద ఎత్తున ప్రజాధనంను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. తమకు కావాల్సిన వారికి దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక రేట్లకు టెండర్లను కట్టబెట్టారని ధ్వజమెత్తారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల రూపంలో వారికి ముందస్తు చెల్లింపులు చేసి దాని నుంచి ఎనిమిది శాతం కింద ముడుపులు అందుకున్న ఘనుడు చంద్రబాబేనని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయన మాట్లాడుతూ.... రాజధాని అమరావతి నిర్మాణంలో కూటమి ప్రభుత్వం ‘పీ–2’ అంటూ ముందుకెళ్తోంది. అదే ‘పెంచుకో. పంచుకో’. అంటే నిర్మాణ వ్యయాన్ని అడ్డగోలుగా పెంచడం. సిండికేట్లతో మిలాఖాత్‌ అవ్వడం, వారికే పనులు అప్పగించడం చేస్తున్నారు. 2014–19 మధ్య కూడా వేల కోట్లు ఖర్చు చేసినా, పనులు ఎక్కడా కొలిక్కి తేలేదు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి దేశంలో ఎక్కడా లేని విధంగా ఖర్చు చేశారు. మళ్లీ ఇప్పుడు శాశ్వత భవనాలు అంటూ, వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటన్నింటి వల్ల, ఇక్కడి రైతులకు కూడా మేలు జరగడం లేదు. ప్రతి పనిలో దోపిడి చేయడం కోసం, భవనాలు మాత్రమే కాకుండా రోడ్ల నిర్మాణ వ్యయాన్ని దారుణంగా పెంచేస్తున్నారు. టెండర్లలో పారదర్శకత, ప్రభుత్వ ఖజానాను కాపాడుకోవడం కోసం గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం.. గతంలో ఎప్పుడూ ఎవరు చేయని విధంగా రివర్స్‌ టెండరింగ్‌ విధానంతో పాటు, జ్యుడీషియరీ ప్రివ్యూ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ, కూటమి ప్రభుత్వం రాగానే నిర్మాణ పనుల్లో యథేచ్ఛ దోపిడికి మార్గం వేసుకుంటూ, ఆ రెండింటినీ రద్దు చేసింది అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa