ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు టికెట్ ధరల పెంపు: రూ.600 కోట్ల అదనపు ఆదాయం లక్ష్యం

national |  Suryaa Desk  | Published : Sun, Dec 21, 2025, 02:52 PM

డిసెంబరు 26 నుంచి భారతీయ రైల్వేశాఖ టికెట్ ధరలను సవరిస్తూ ప్రకటన చేసింది. పెరుగుతున్న ఖర్చులను భర్తీ చేస్తూ, ఎక్కువ మందికి రైల్వే సేవలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 215 కి.మీల కంటే తక్కువ దూరం ఆర్డినరీ క్లాస్‌లో ఛార్జీలు పెంచలేదు. అంతకంటే ఎక్కువ దూరానికి ఆర్డినరీ క్లాస్‌లో కిలోమీటరుకు 1 పైసా, మెయిల్/ఎక్స్‌ప్రెస్ ఏసీ, నాన్-ఏసీ రైళ్లలో కిలోమీటరుకు 2 పైసలు పెంచారు. నాన్-ఏసీ ట్రైన్‌లో 500 కి.మీ ప్రయాణానికి అదనంగా రూ.10 చెల్లించాలి. ఈ మార్పుల వల్ల రైల్వేకు దాదాపు రూ.600 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa