కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పల్నాడులో ముస్లింలు చేపట్టిన ర్యాలీకి మాజీ మంత్రి విడదల రజనికి హాజరైనారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలు ర్యాలీ చేపట్టారు.ముస్లింలకు సంఘీభావం తెలుపుతూ మాజీ మంత్రి రజని ఈ ర్యాలీకి హాజరయ్యారు. కళామందిర్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ చౌత్రా సెంటర్ వద్దకు రాగానే మాజీ మంత్రి విడదల రజిని ర్యాలీలో పాల్గొని కొంతదూరం నడిచారు. అయితే, మాజీ మంత్రి రాకతో శాంతియుతంగా చేపట్టిన తమ ర్యాలీకి రాజకీయ రంగు అంటుతుందని ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ర్యాలీ నుంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు ఆమెను కోరారు.అయితే, వక్ఫ్ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని, రాజకీయ నాయకులు కూడా వాటిలో పాల్గొంటున్నారని చెబుతూ పోలీసులతో రజని వాగ్వాదానికి దిగారు. దీనిపై ర్యాలీ నిర్వాహకులు స్పందిస్తూ.. పార్టీలకతీతంగా ముస్లింలంతా ఈ ర్యాలీలో పాల్గొన్నారని చెప్పారు. దీనితో రజిని వైసీపీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడి వెళ్లిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa