నటి కాదంబరి జెత్వానీ కేసులో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం సీఐడీ కార్యాలయానికి పీఎస్సార్ ఆంజనేయులును అధికారులు తరలించారు. అయితే నిన్న హైబీపీ కారణంగా పీఎస్ఆర్ను సీఐడీ విచారించని విషయం తెలిసిందే. దీంతో విచారణను అధికారులు ఈరోజు వాయిదా వేశారు. జెత్వానీ అరెస్టు, నిర్బంధం వ్వహహారంలో పీఎస్సార్ను సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ముంబై నటి జెత్వానీ అక్రమ అరెస్ట్, నిర్బంధం కేసుకు సంబంధించి పీఎస్ఆర్ ఆంజేయులును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జెత్వానీ కేసులో ఎవరి ఆదేశాలతో ఆయన వ్యవహారం నడిపించారు.. విశాఖ గున్నీని ముంబై పంపించాల్సిన అవసరం ఏంటి, ఎవరు చెబితే ఇదంతా చేశారు అనే అంశాలపై ఆరా తీయనున్నారు. జెత్వానీ కేసుకు సంబంధించి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని పీఎస్ఆర్ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో మూడు రోజుల పాటు ఆయనను విచారించేందుకు కోర్టు అనుమతించింది. నిన్న, ఈరోజు, రేపు ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నిన్న తొలిరోజు ఉదయం 10:30 గంటలకు విజయవాడ జిల్లా జైలుకు వెళ్లిన సీఐడీ అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa