ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఊహించని ట్విస్ట్..,,మాజీ కౌన్సిలర్‌కు ఏపీ రాజ్యసభ సీటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 08:42 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీపై ఉత్కంఠ వీడింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ కాగా.. ఈ స్థానం బీజేపీకి దక్కనుంది. బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణకు ఎన్డీఏ కూటమి తరుఫున రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా ఖరారు చేశారు. భీమవరానికి చెందిన పాకా వెంకట సత్యనారాయణ గతంలో భీమవరం కౌన్సిలర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణా సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు మంగళవారం మధ్యాహ్నం వరకూ గడువు ఉంది. దీంతో కూటమి తరుఫున పాకా వెంకట సత్యనారాయణను రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేశారు.


వ్యక్తిగత ఖాతాలో విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఓ సీటు ఖాళీ కాగా.. ఈ స్థానం ఏ పార్టీకి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓ దశలో విజయసాయిరెడ్డి బీజేపీ తరుఫన బరిలో ఉంటారంటూ వార్తలు కూడా వచ్చాయి. అలాగే తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అలాగే మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేరు కూడా చర్చకు వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. చివరకు ఏపీకి చెందిన వ్యక్తికే ఈ స్థానాన్ని కట్టబెట్టాలని నిర్ణయించిన బీజేపీ.. పాక వెంకట సత్యనారాయణ పేరును ఖరారు చేసినట్లు సమాచారం.


మరోవైపు విజయసాయిరెడ్డి మరో రెండేళ్లు పదవీకాలం ఉండగానే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి వైసీపీకి కూడా గుడ్ బై చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని.. వ్యవసాయం చేసుకుంటానంటూ ప్రకటించారు. విజయసాయిరెడ్డి రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ వెంటనే ఆమోదించారు. అనంతరం ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. దీంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ గడువు ముగియనుంది. దీంతో తీవ్ర తర్జనభర్జనల అనంతరం.. పాక వెంకట సత్యనారాయణ వైపు బీజేపీ అధిష్టానం మొగ్గుచూపినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa