రాజకీయం పేరుతో చంద్రబాబు ఆడుతున్న వికృత క్రీడను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ అధికార ప్రతినిధులకు పిలుపునిచ్చారు. సోమవారం వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలను ఏరకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశంపై అధికార ప్రతినిధులకు పార్టీ స్టేట్ కో -ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ...... పార్టీ ఆలోచనలను, విధానాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రత్యర్థులకు ధీటుగా వాళ్ళలోకి ఎలా తీసుకెళ్లాలి అన్న అంశాలపై అవగాహన కలిగించడమే ఈ వర్క్ షాప్ ఉద్దేశం. రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మీరు ఈ మెళకువలు వాడుకుని జనంలోకి తీసుకునిపోవాలి. మీ ద్వారా పార్టీని మరింత బలోపేతం కావాలి. మీడియానే నమ్ముకుని దాని ద్వారానే ప్రజలను భ్రమలో పెట్టే బలమైన, అత్యంత శక్తివంతమైన దురాలోచనలు చేయగలిగే ప్రత్యర్థిని మనం ఎదుర్కుంటున్నాం. కాబట్టి మనం చాలా వేగంగా అన్ని అంశాలపై విస్తృతంగా అవగాహన చేసుకోవాలి. ఇది చాలా ప్రాధాన్యమైన అంశం. ఇప్పటికే పార్టీ కార్యకర్తలుగా మీరు పార్టీ ఐడియాలజీ ప్రకారం పనిచేస్తున్నారు. దానిని మరింత మెరుగుపర్చుకోవడానికి ఈ వర్క్ షాప్ మీకు ఉపయోగపడుతుంది. ప్రొఫెషనల్ గా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళడానికి, మీరు ఎదగడానికి కూడా సహకరిస్తుంది. సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే మీకు మీరుగా కూడా స్మార్ట్ ఫోన్ సహకారంతోనే విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకుపోవచ్చు. మీ అభిప్రాయాన్ని వేలు, లక్షల మందికి కూడా రీచ్ అయ్యేలా చేసే అవకాశం ఉంటుంది. పార్టీ అధికార ప్రతినిధులుగా మీకు ఈ అవగాహన అనేది చాలా అవసరం` అని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa