ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని కేంద్ర నిర్ణయం..

national |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 06:15 PM

సర్వేలకు బదులుగా పారదర్శకంగా కులగణన..కులాల అసలు సంఖ్య జనాభా లెక్కల్లో తెలుస్తుంది..1931 తర్వాత ఎవరూ కులగణన చేయలేదు ..కాంగ్రెస్ చేసిన కులగణనతో సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది.2019లోనే జనగణన చేయాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా అప్పుడు ముందుడగు పడలేదు.దాంతో పాటు షిల్లాంగ్-సిల్చారు జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 22,864 కోట్ల రూపాయల ఖర్చుతో 166 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే  నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా త్రిపుర, మిజోరం, మణిపూర్, అస్సాంలోని బరాక్ వ్యాలీకి కనెక్టివిటీ పెరగనుంది. అదే సమయంలో చెరకు మద్దతు ధర క్వింటా రూ. 350 పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రి మండలి నిర్ణయాలను  కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa