యుద్ధ వాతావరణాన్ని అంచనా వేస్తూ పాకిస్థాన్ సైనికంగా అప్రమత్తమైంది. త్రివిధ దళాలను సిద్ధంగా ఉంచుతూ భారత్ సరిహద్దుల్లో బలగాల కదలికలు ప్రారంభించింది. గగనతలంలో ఎయిర్ఫోర్స్, సముద్ర మార్గాల్లో నేవీ చురుకుగా విన్యాసాలు చేస్తున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ సరిహద్దు ప్రాంతాలను సందర్శించి జవాన్లకు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీలోనూ భద్రతా దళాలు హైఅలర్ట్లోకి వెళ్లాయి.ఈమేరకు బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్ ప్రకటించింది. రాడికల్ గ్రూపులను పాకిస్తాన్ గూఢచార సంస్థ “ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్” (ఐఎస్ఐ) యాక్టివ్ చేసినట్లు తెలుస్తోంది. రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోందని భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. హై సర్వెలైన్స్లో నిఘా వర్గాలు ఉన్నాయి. బంగ్లా సరిహద్దుల్లో భారత సైనిక దళాలు అప్రమత్తమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa