కేంద్రప్రభుత్వం జనగణనతో పాటు కులగణనను చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని వైయస్ఆర్సీపీ స్వాగతిస్తోందని పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మొట్టమొదటిగా కులగణనను చేపట్టింది వైయస్ జగన్ ప్రభుత్వమేనని వెల్లడించారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన ఈ కులగణన నివేదికను కూటమి ప్రభుత్వం దురుద్దేశంతోనే బహిర్గతం చేయడం లేదని మండిపడ్డారు. అయన మాట్లాడుతూ.... కులాల వారీగా జనగణన గణించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వైయస్ఆర్సీపీ సంపూర్ణంగా మద్దతు ఇస్తోంది. 1931లొ దేశవ్యాప్తంగా కులగణన జరిగింది. తరువాత సమగ్ర కులగణన చేసిన దాఖలాలు లేవు. కులాల వారీగా జనగణన చేయడం వల్ల ఆయా కులాల సామాజిక, ఆర్థిక, విద్యా పురోగతిని తెలుసుకునేందుకు దోహదం చేస్తుంది. కులాల్లోని వెనుకబడిన వారికి చేయూత ఇచ్చేందుకు, ప్రభుత్వ పథకాలను అందచేసి వారిని అభివృద్దిలో భాగస్వామ్యం చేయడానికి వీలవుతుంది. అందుకే జగగణనను కులాల వారీగా చేయడాన్ని స్వాగతిస్తున్నాం. వైయస్ జగన్ తన పరిపాలనా కాలంలో అట్టడుగు వర్గాలకు చేయూతను అందించి, వారిని ప్రగతి వైపు నడిపించేందుకు కృషి చేశారు. అన్ని రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లీం, అగ్రవర్ణపేదల సంక్షేమం, వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా కృషి చేశారు. ఆయన అమలు చేసిన డీబీటీతో పాటు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించారు. అభివృద్ది, సంక్షేమంలో వారిని భాగస్వాములను చేసిన గొప్ప సంస్కర్త వైయస్ జగన్. కులం, మతం, పార్టీని ప్రాతిపాదికగా తీసుకోకుండా అర్హులైన వారికి సంక్షేమాన్ని అందించిన గొప్ప నాయకుడు వైయస్ జగన్. కూటమి ప్రభుత్వంలో ఏదైనా సంక్షేమాన్ని అందించాలంటే కులం, మతం, పార్టీ ఏమిటీ అని వివక్ష చూపుతున్నారు. అభివృద్ది, సంక్షేమాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్ళేందుకు కులాల వారీగా జనాభాను లెక్కించాలని గతంలోనే వైయస్ జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బీసీకుల గణన చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి, 2021లోనే కేంద్రానికి పంపించిన మొట్టమొదటి రాష్ట్రం ఏపీ అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa