స్టోన్ క్రషర్ వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన మాజీ మంత్రి విడుదల రజని మరిది విడుదల వేణుగోపీనాథ్ (గోపి)ని రెండోరోజు ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు ఉదయం జిల్లా జైలుకు వచ్చిన అధికారులు.. గోపీని కస్టడీలోకి తీసుకుని ముందుగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారించనున్నారు. తొలిరోజు విచారణలో భాగంగా ఏసీబీ ముందు గోపి కీలక అంశాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండో రోజు విచారణలో కూడా విడుదల గోపి నుంచి మరింత సమాచారం రాబట్టాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. గోపిని రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. తొలిరోజు విచారణలో భాగంగా పలు కీలక విషయాలు గోపి బయటపెట్టినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టోన్ క్రషర్ వారు తనకు న్యాయం చేయాలని కోరగా.. దీనిపై ఏసీబీ విచారణకు సర్కార్ ఆదేశించింది. ఈ క్రమంలో బెదిరింపులు నిజమే అని ఏసీబీ తేల్చడంతో పాటు ఈ కేసులో విడుదల రజని సహా నలుగురిని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో విడుదల గోపిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయాధికారి. ఏసీబీ కస్టడీకి కోరుతూ పిటిషన్ వేయడంతో గోపిని రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. తొలిరోజు విచారణ ముగియగా.. రెండో రోజు గోపినీ ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa