ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీకి సన్మానం చేసిన గౌతమ్ అదానీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 01:07 PM

తిరువనంతపురంలో ప్రధాని నరేంద్ర మోదీకి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సన్మానం చేశారు. నేడు మోదీ రూ. 8,900 కోట్ల విలువైన "విజింజం ఇంటర్నేషనల్ డీప్‌వాటర్ మల్టీపర్పస్ సీ పోర్ట్"ను దేశానికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గొన్నారు. ఇది కేరళ ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో APSEZ ద్వారా అభివృద్ధి చేయబడింది.ఈ పోర్టు రూపకర్త ముఖ్యమంత్రి పినరయి విజయన్ అని మంత్రి వి.ఎన్. వాసన్ వెల్లడించారు.ప్రతి సంవత్సరం దేశానికి జరుగుతున్న సుమారు 22 కోట్ల డాలర్ల నష్టాన్ని ఈ పోర్టు తగ్గించగలదని సీఎం విజయన్ తెలిపారు.గతంలో అవసరమైన సదుపాయాలు లేనందున దాదాపు 75 శాతం కంటైనర్ కార్గోలను విదేశాల్లోని పోర్టుల ద్వారా మళ్లించాల్సి వచ్చేది.అయితే ఇప్పుడు విజిన్‌జం పోర్టు ప్రారంభంతో ఆ సమస్యకు పరిష్కారం లభించనుందని, ఇది దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.ప్రకారం ప్రకారం ఈ ప్రాజెక్టు 2045 నాటికి పూర్తవ్వాల్సి ఉండగా, దశాబ్దం ముందే పనులు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa