ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 03:47 PM

ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులను మోదీ ప్రారంభిస్తారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు.గన్నవరం విమానాశ్రయం మొత్తం పోలీసుల వలయంలోకి వెళ్లింది. ఈ క్రమంలో గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం రేగింది. కలకత్తా వెళ్లడానికి ముగ్గురు ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే వారిలో ఒక ప్రయాణికుడు ఒక్కసారిగా అరుపులు కేకలు వేయడం మొదలుపెట్టాడు. దీంతో మిగిలిన ప్రయాణికులు కంగారుపడ్డారు. వీవీఐపీ రద్దీ ఉన్న ఎయిర్‌పోర్టులో అలజడి చెలరేగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే ఆ ప్రయాణికుడిని ప్రైవేటు క్యాబ్‌లో గన్నవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అసలు ఆ ప్రయాణికుడికి ఏం జరిగిందనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa