ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమను కట్టుబట్టలతో నుంచి మెడబట్టి గెంటేశారు: నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 08:22 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునః నిర్మాణ పనులకు వెలగపూడిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో మెడపట్టి గెంటేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ.. బెదరకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిని రాజధానికి నిర్మించేందుకు రాష్ట్ర ప్రజల సహకారంతో నాడు పనులు ప్రారంభించుకున్నాం.


'హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని నిర్మాణ పనుల్ని ఘనంగా ప్రారంభించుకున్నాం. అందుకు అనుగుణంగా ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది. రైతులు స్వచ్ఛదంగా వేల ఎకరాల భూమి ఇచ్చి రాజధాని నిర్మాణానికి మద్ధతు నిలిచారు. ప్రాధాన్యత క్రమంలో అనేక నిర్మాణాలను పూర్తి చేశాం. తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం అమరావతి రాజధానిని నిర్లక్ష్యం చేసి మిగతా నిర్మాణాలను విస్మరించిది'అని లోకేష్ పేర్కొన్నారు.


ఇదే సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో హైదరాబాద్‌లో హైటెక్ సిటీని స్థాపించి ఐటీ విప్లవానికి నాంది పలికానని తెలిపారు. ఆ సమయంలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేజ్ ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. అదే స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో అమరావతిలో అధునాతన క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అందుకోసం ప్రముఖ కంపెనీలైన ఐబీఎం, టీసీఎస్, ఎల్ అడ్ టీ వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు.


గతంలో ఐటీ విప్లవానికి హైదరాబాద్ ఊతమచ్చినట్టే.. క్వాంటం విప్లవానికి అమరావతి నాయకత్వం వహిస్తుందని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. సిలికాల్ వ్యాలీ తరహాలో క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చి దిద్దుతామన్నారు. భవిష్యత్‌లో పరిపాలనకు, ఆవిష్కరణలకు క్వాంటం కంప్యూటింగ్ పునాది అవుతుందని చంద్రబాబు అన్నారు. 15 నెలల్లోనే హైటెక్ సిటీ నిర్మాణాన్ని పూర్తి చేసిన అనుభవంతో.. క్వాంటం వ్యాలీని వేగంగా పూర్తి చేస్తామని వెల్లడించారు. అందుకోసం ఇప్పటికే ఎల్ అండ్ టీ సంస్థకు స్థలం కూడా కేటాయించినట్టు తెలిపారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa