భారతదేశం మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం. అయితే.. నేటి పరిస్థితుల్లో విద్వేషాలు పెరుగుతున్న నేపథ్యంలో.. మతపరమైన ఊరేగింపుల సమయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండటం సాధారణమైపోయింది. కానీ, తమిళనాడులోని మధురైలో జరిగిన ఒక అద్భుత దృశ్యం ఈ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ మీనాక్షి అమ్మవారి ఊరేగింపు సందర్భంగా, ముస్లిం సోదరులు హిందూ భక్తులకు మసీదు ఎదుట చల్లని రోజ్ మిల్క్ అందించి మత సామరస్యానికి గొప్ప ఉదాహరణగా నిలిచారు. మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో జరిగే చిత్తిరై ఉత్సవం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్సవంలో భాగంగా మీనాక్షి సుందరేశ్వరుల స్వర్ణ పల్లకి ఊరేగింపు వైభవంగా జరిగింది. ఊరేగింపు ముఘాయిద్దీన్ అండవర్ మసీదు మీదుగా వెళుతుండగా, మసీదు సభ్యులు భక్తులకు మరియు పూజారులకు చల్లని రోజ్ మిల్క్, స్వీట్లు అందించారు. పరస్పర గౌరవాన్ని చాటుకుంటూ, ఆలయ అర్చకులు మసీదు ప్రతినిధికి పూలమాల సమర్పించారు. ఒక ముస్లిం మహిళ చిన్నారి దేవతామూర్తిని ఎత్తుకుని మీడియాతో మాట్లాడటం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. పండుగ సమయంలో మత సామరస్యాన్ని పెంపొందించడమే తమ ఉద్దేశ్యమని మసీదు నిర్వాహకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa