ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాజాపై ఇజ్రాయిల్‌ దాడి: 20 మంది పాలస్తీనియన్ల మృతి, ఆహార సరఫరా నిలిపివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 05, 2025, 04:12 PM

సోమవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయిల్‌ సైన్యం గాజాపై తీవ్ర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 20 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు సమాచారం. ఇజ్రాయిల్‌ సైన్యం గాజా స్ట్రిప్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేపట్టింది. 
మరోవైపు, గాజాలో ఆహార సరఫరాను ఇజ్రాయిల్‌ సైన్యం పూర్తిగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ చర్య వల్ల గాజాలోని సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దాడులు, సరఫరా నిలిపివేతల నేపథ్యంలో గాజాలో మానవతా సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa