పహల్గామ్ ఘటనతో రగిలిపోతోన్న భారత్... పాకిస్థాన్ను అన్ని విధాలుగా అష్టదిగ్బంధం చేసి.. దాని వెన్ను విరిచే ప్రయత్నాలు చేస్తోంది. నేడో రేపో సైనిక చర్య కూడా చేపట్టే అవకాశం ఉంది. పాకిస్థాన్ నాయకులు, అధికారులు కూడా దాడి తప్పదనే భయంతోనే ఉన్నారు. ఈ క్రమంలో అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు భారత్ను సమర్ధించారు. తన దేశ సార్వభౌమత్వం, ప్రజలపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే హక్కు న్యూఢిల్లీకి ఉందని స్ఫష్టం చేశారు. ‘తన సార్వభౌమత్వం, ప్రజలపై ఉగ్రవాదుల దాడులకు ప్రతీకారం తీర్చుకోవడం, వాటిని నిర్మూలించడానికి ప్రయత్నించడం అనేది భారత్కు పూర్తి హక్కు’ అని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ చెప్పారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ దాడికి పాకిస్థాన్పై భారత్ దాడిచేస్తుందనే వార్తల నేపథ్యంలో ఆయన ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. పాక్ దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నాలు చేస్తూ.. భారత రక్షణ రంగ వెబ్సైట్లపై సైబర్ దాడికి ప్రయత్నిస్తోంది.
బోల్టన్ మాట్లాడుతూ.. ‘భారత్కు స్వీయ రక్షణ హక్కు ఉంది.. సైనిక ప్రతిచర్యకు ముందు అన్ని రకాల దౌత్య మార్గాలను పూర్తిగా వినియోగించాలి’ అని సూచించారు. ప్రపంచానికి భారత్ ఒక ఉదాహరణగా నిలవాలని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలూ చేసినట్టు రికార్డు ఉండాలని చెప్పారు. ‘భారత ప్రధాని నరేంద్ర మోదీ 2019 ఫిబ్రవరి పుల్వామా ఉగ్రదాడి సమయంలోనే గొప్ప సహనాన్ని ప్రదర్శించారు’ అని గుర్తుచేశారు. పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాడుల ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.. ఈ ఘటనతో బాలాకోట్లోని జైషే శిబిరాలపై భారత వాయుసేన దాడిచేసింది.
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా సైనిక చర్య జరగనుందనే ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ‘‘ఇది చాలా క్లిష్టమైన సమస్య. కానీ ఇప్పుడు మనం (అంటే అమెరికా ,ఇతర దేశాలు) ఇరు దేశాలకు హితవు పలికే అవకాశం ఉంది. కానీ, ఈ సమస్య పునరావృతం కాకుండా చూసే మార్గాన్ని మనం అన్వేషిద్దాం’ అని ఆయన సూచించారు. ఇందుకు ఆయన రెండు మార్గాలను వెల్లడించారు.
ఆగిపోయిన చీనాబ్ నీళ్లు.. ఎడారిగా పాకిస్థాన్
‘‘పాకిస్థాన్పై పెరిగుతున్న చైనా ప్రభావం గురించి భారత్ తీవ్రంగా ఆలోచించాలి... ఇరు దేశాలు ( భారత్, పాక్) పరస్పరం కూర్చుని. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా చర్చించుకోవాలి’ అని బోల్టన్ సూచించారు. ‘ఇదే సమయంలో చైనాను సంప్రదించి, ఉగ్రవాద సమూహాలను పాక్ నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేయాలి... ఈ రెండు మార్గాలు విఫలమైన తర్వాతే పాకిస్థాన్పై అన్ని దౌత్యపరమైన చర్యలు తీసుకున్నామని ప్రపంచానికి తెలియజేసి సైనిక చర్యపై ముందుకెళ్లాలి’ అని ఆయన చెప్పారు.
అంతేకాదు.. సైనిక చర్య ఉగ్రసంస్థలే లక్ష్యంగా ఉండాలన్న ఆయన.. తద్వారా పాకిస్థాన్కు మళ్లీ చర్చలు ప్రారంభించుకునే అవకాశం ఇచ్చినట్టు అవుతుందని వివరించారు. ‘పొరుగు దేశాలతో విభేదాలు ఉండొచ్చు... కానీ దాన్ని వ్యక్తపరించేందుకు ఉగ్రవాదాన్ని ఎంచుకోవడం ఎప్పటికీ సరైన మార్గం కాదు’ అని బోల్టన్ ఉద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa