కూటమి ప్రభుత్వం తాజాగా యాక్సిస్ సంస్థలతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల వెనుక రూ.11,000 కోట్ల అవినీతి ఉందని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఆనాడు వైయస్ జగన్ దేశంలోనే అతితక్కువ రేటుకు సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే, దానిపై చంద్రబాబు విషం చిమ్ముతూ తప్పుడు ఆరోపణలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సీఎంగా చంద్రబాబు తన బినామీ సంస్థలైన యాక్సిస్తో దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోళ్ళు చేస్తూ భారీ కుంభకోణంకు తెర తీశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయన మాట్లాడుతూ..... చంద్రబాబు తన పదకొండు నెలల పాలనలోనే స్కామ్ల ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఉర్సా స్కామ్ను ప్రజలు మరిచిపోక ముందే, ఏపీఈఆర్సీ అనుమతితో ఈ నెల 2వ తేదీన ఒక జీఓను జారీ చేశారు. చంద్రబాబు తన బినామీలతో పుట్టగొడుగుల్లా ప్రైవేట్ కంపెనీలను ప్రారంభింప చేస్తున్నారు. దానిలో భాగంగానే యాక్సిస్ రెన్యువబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిస్ రెన్యువబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ (కృష్ణా), యాక్సిస్ రెన్యువబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆంధ్రప్రదేశ్), యాక్సిస్ రెన్యువబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ (తుంగభద్ర) పేరుతో కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఈ కంపెనీల నుంచి విండ్, సోలార్ ప్రాజెక్ట్ల ద్వారా వంద మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేస్తున్నట్లుగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. యూనిట్ రూ.4.60 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లుగా ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇది దేశంలోనే అతి ఎక్కవ రేటు. అంటే తన బినామీ కంపెనీలకు రాష్ట్ర ఖజానాను దోచిపెట్టేందుకు చంద్రబాబు ఈ కుంభకోణంకు శ్రీకారం చుట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa