ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందించిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 01:00 PM

పాకిస్తాన్‌పై భారత్‌ దాడులు ఆపరేషన్‌ సిందూర్‌పై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. ఆపరేషన్‌ సిందూర్‌పై వైయ‌స్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తాం. జైహింద్’ అని పోస్టు చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa