ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల పట్ల ఇంత వివక్ష ఎందుకు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 01:03 PM

అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిచిపోయి దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతుల పట్ల, వ్యవసాయం పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు పండించిన పంటలకు మద్దతు ధరలు కల్పించడం లేదు, మరోవైపు ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు రైతులకు అండగా నిలబడకుండా చంద్రబాబు తన రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa