ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదాన్నీ అంతం చేసేవరకు ఈ పోరాటాలు ఆగవు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 04:51 PM

భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంపై హోంమంత్రి వంగలపూడి అనిత  హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బుధవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ భారత దేశ గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని ప్రపంచ పటముపై మరోసారి నిలిపిందని కొనియాడారు. పహల్గామ్ దాడికి భారతదేశం సాహసోపేతంగా తగిన ప్రతీకారం తీర్చుకుందన్నారు. ఉగ్రవాదానికి శాశ్వతంగా ముగింపు వచ్చే వరకు భారతదేశం తన ఆపరేషన్‌లను కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఇకనైనా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడం నిలిపివేయాలని, దేశ రక్షణలో ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న కట్టుదిట్టమైన విధానం అభినందనీయమని వంగలపూడి అనిత అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa