కుంటిమద్ది హెలిప్యాడ్ ఘటన కేసులో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. గత కొంత కాలంగా అజ్ఞాతంగా ఉన్న ఆయన, ఈ రోజు అనంతపురం తిరిగి వచ్చారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న సీకేపల్లి ఎస్.ఐ సత్యనారాయణ, తన సిబ్బందితో కలిసి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇంటికి వెళ్లి, 12 మేలోపు రామగిరి సర్కిల్ పోలీస్ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కుంటిమద్ది హెలిప్యాడ్ ఘటనకు సంబంధించి, ఈ కేసులో అతని పాత్రను విచారించేందుకు పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa