ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 08, 2025, 02:16 PM

ఏపీ కేబినెట్ భేటీ ఇవాళ జరుగనుంది. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఉదయం 11గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. అమరావతి పున: ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్ ఈరోజు ఆమోదం తెలపనుంది.పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ ఆమోదం తెలపనుంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే ఛాన్స్ ఉంది. తీర ప్రాంత భద్రతపై ప్రత్యేకంగా కేబినెట్‌తో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించిన భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు కేబినెట్‌ అభినందనలు తెలపనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa