ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనమంతా భారత సాయుధ దళాలకి అండగా నిలుదాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 08, 2025, 02:22 PM

ఉగ్రవాదులు జమ్మూకాశ్మిర్ ప్రాంతంలో దాడికి పాల్పడి 26మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతి చర్యగా భారత్ ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడ్డారు. ఐతే దీనిపై పలువురు నాయకులు  హర్షం వ్యక్తపరుస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ఆపరేషన్‌ సిందూర్‌ని చేపట్టాయని మాజీ సీఎం జగన్‌ అన్నారు. బుధవారం ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘ఇలాంటి సమయాల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో చేపట్టిన ఇలాంటి చర్యలు చెక్కుచెదరని జాతి ఐకమత్యాన్ని ప్రతిఫలిస్తాయి. మేమంతా మీతోనే ఉన్నాం. జై హింద్‌’ అని జగన్‌ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa