దేశంలో యుద్ధ పరిస్థితులు నెలకొన్న తరుణంలో అందరం ప్రధాని మోదీకి అండగా నిలుద్దామని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి ఆయన తిరుపతి జిల్లా సత్యవేడులో నియోజకవర్గ టీడీపీ ఉత్తమ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఉగ్రమూకలపై ఆపరేషన్ సిందూర్ పేరిట ప్రధాని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. అందరం తొలుత భారతీయులమని, సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్న సైనికులకు సంఘీభావం తెలపాలని కోరారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా కుటుంబ సాధికార సారథులుగా పని చేయాల్సిందేనని లోకేశ్ కుండబద్దలు కొట్టారు. సమావేశం అనంతరం లోకేశ్ రాత్రికి సత్యవేడులోనే బస చేశారు. గురువారం ఉదయం శ్రీసిటీలో ఎల్జీ పరిశ్రమకు శంకుస్థాపన చేసి అనంతరం హైదరాబాద్ వెళ్లనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa