చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వార్తలు రాసినందుకు ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై పోలీసులు వేధింపు చర్యలకు దిగారని వైయస్ఆర్సీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు పత్రికా స్వేచ్ఛ ఉందా అని ఆయన ప్రశ్నించారు. సాక్షాత్తు పత్రిక సంపాదకులను టార్గెట్ చేయడం శోచనీయమని, ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమే అని ధ్వజమెత్తారు. ఎడిటర్ ధనుంజయ రెడ్డి నివాసంలో పోలీసుల సోదాలను వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. దీనిపై కోర్టులను ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. అయన మాట్లాడుతూ.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్చకు సంకెళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వార్తలు రాసినందుకు ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై పోలీసులు వేధింపు చర్యలకు దిగారు. సోదాల పేరుతో ఏపీ పోలీసులు గురువారం ఉదయం ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లోకి చేరుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండానే ధనుంజయ రెడ్డి ఇంటికి పోలీసులు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేశారు. ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. కాసేపటికే ఇంటి తలుపులు మూసివేసి గంటల తరబడి సోదాలు చేశారు. అయితే, గతంలోనూ ధనుంజయ రెడ్డిపై పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూ కథనాలు రాసిన పలువురు విలేకర్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు అని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa