అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నగర అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి మంజునాథ్ ఉమా మహేష్ మీడియాతో మాట్లాడారు.
వారు మాట్లాడుతూ, “ఒక్క రోజు హాజరు లేకపోతే రూ.200, వారం రోజుల అప్సెంట్ అయితే రూ.1000 వరకు ఉపాధ్యాయులు విద్యార్థుల వద్ద వసూలు చేస్తున్నారు. ఇది పూర్తిగా అన్యాయమయ్యే క్రమం. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్న ఉపాధ్యాయులను వెంటనే సస్పెండ్ చేయాలి” అని డిమాండ్ చేశారు.
అలాగే, కళాశాలలో ఫ్యాన్లు, లైట్లు పనిచేయకపోయినా, మౌలిక సదుపాయాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా విద్యార్థుల నుండే నిధులు వసూలు చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ అన్యాయాలకు తగిన న్యాయం జరిగేంతవరకూ పోరాటం కొనసాగిస్తామని ఏఐఎస్ఎఫ్ నాయకత్వం హెచ్చరించింది. ప్రభుత్వం తక్షణమే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa