ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బలోచిస్థాన్‌లో పాక్‌పై తిరుగుబాటు.. 39 చోట్ల మెరుపు దాడులు

national |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 04:01 PM

ఓ పక్క భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పాకిస్థాన్‌ మరో వైపు తిరుగుబాటును ఎదుర్కొంటోంది. బలోచిస్థాన్‌ ప్రాంతంలో బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (BLA) తిరుగుబాటు ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో ఒక పట్టణాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు BLA ప్రకటించింది. ఇప్పటికే 39 చోట్ల మెరుపు దాడులు నిర్వహించామని తెలిపింది. గత రెండు రోజులుగా పాక్ సైన్యంపై బలోచ్‌ రెబల్స్‌ వరుస దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.బలుచిస్థాన్ వేర్పాటు వాదులు, పాకిస్థాన్ సైన్యం మధ్య చాలా కాలంగా సమస్యలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌లో బలూచిస్థాన్ భౌగోళికంగా అతిపెద్ద రాష్ట్రం అయినప్పటికీ అభివృద్ధిలో మాత్రం బలూచిస్థాన్ చాలా వెనకబడి ఉంది. బలూచిస్థాన్ నుంచి ఆయిల్, గ్యాస్, ఖనిజాలు వంటి సంపదలు వెలువడుతున్నప్పటికీ దాని లాభాన్ని స్థానిక ప్రజలకు రాకుండా పాక్ సైనిక ప్రభుత్వ వ్యవస్థ కబ్జా చేసిందనేది బలూచిస్థాన్ ప్రజల ఆరోపణ. వేర్పాటు వాద భావాలను అణచివేసేందుకు పాక్ సైన్యం ఐఎస్‌ఐ వంటి సంస్థల ద్వారా బీఎల్‌ఏపైన తీవ్ర హింసకు పాల్పడుతోంది. వేలాది మంది యువకులు గల్లంతైన పరిస్థితి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa